చందానగర్ డివిజన్ అభివృద్ధే ధ్యేయం: కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని భవానీపురం కాలనీ, వేమన వికర్ సెక్షేన్ కాలనీ, కేఏస్అర్ లేఔట్ లలో శేరిలింగంపల్లి జోన్ జలమండలి శాఖ జనరల్ మేనేజర్ రాజశేఖర్ రెడ్డి తో కలిసి చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి పర్యటించారు.

కాలనీ లలో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను నూతనంగా చేపట్టాల్సిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పరిశీలించారు. కాలనీలలో మురికి నీరు రోడ్లపై రాకుండా జలమండలి అధికారులు, సిబ్బంది వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జనరల్ మేనేజర్ రాజశేఖర్ రెడ్డి ని కోరారు. చందానగర్ డివిజన్ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ బిఆర్ఏస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి , జలమండలి అధికారులు డిజియం నాగప్రియ, మేనేజర్ సుబ్రహ్మణ్యం, బిఆర్ఏస్ పార్టీ నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here