- ముంపు ప్రాంతాల్లో పర్యటన
- పట్టించుకోని బిఆర్ ఎస్ పై అగ్రహం
- కనీస సౌకర్యాలు కల్పించి ఆదుకోవాలని ప్రభుత్వానికి మొవ్వ సత్య నారాయణ డిమాండ్
నమస్తే శేరిలింగంపల్లి : పేద ప్రజల బాధలు మీకు పట్టావా..? ఉండటానికి సరైన ఇల్లు లేక.. వర్షాలొస్తే ఎక్కడ తలదాల్చుకోవాలో తెలవక సతమతమవుతున్నారని.. వారి గోస మీకు కానరావట్లేదా .. మీ కుటుంబ పాలన సరిగా ఉంటే సరిపోతుందా అంటూ బిఆర్ ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే మొవ్వా సత్యనారాయణ. శేరిలింగంపల్లి నియోజకవర్గం, మియాపూర్ డివిజన్, ఓంకార్ నగర్ నివాసితుల ఇబ్బందులు తెలుసుకున్న అనంతరం ఇలా మాట్లాడారు.
తెలంగాణ బీద ప్రజలకు డబల్ బెడ్ రూమ్స్ ఇస్తామని ముప్పు తిప్పలు పెడుతున్న బి ఆర్ ఎస్ ప్రభుత్వ అరాచకాలు ఇంకా మారవా అన్నారు. బి ఆర్ ఎస్ ప్రభుత్వ అధికారులారా.. ఒక్కసారి ఇటు వచ్చి వీరి సమస్యలు పరిష్కరించండి. ఓంకార్ నివాసీలకు కనీసం ఉండడానికి సరైన ఇల్లు, తాగునీటి సౌకర్యం ఇవేమి లేవని, మురుగు నీటి కంపు, దోమల బెడద, తదితర సమస్యలు ఎదుర్కొంటున్నారని, వాళ్ళ ఇళ్లల్లో మొత్తం వరద నీరు చేరి ఇక్కట్లు పడుతున్నారని తెలిపారు.
స్థానిక కార్పొరేటర్, ఎమ్మెల్యే కనీసం పట్టించుకోని పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పారు. కనీసం రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పెన్షన్, కూడా లేవని, ఇవన్నీ సౌకర్యాలు కల్పించి వారిని ఆదుకోవాలని కోరారు.