శేరిలింగంపల్లి సర్కిల్ లో 63 మంది అభ్యర్థులు…87 నామినేషన్ లు

శేరిలింగంపల్లి(నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని కొండాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి డివిజన్లలో మూడురోజుల నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. మూడు డివిజన్లకు గానూ 63 అభ్యర్థులు 87 నామినేషన్లు దాఖలు చేసారు. డివిజన్ల వారీగా అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి.

నామినేషన్ దాఖలు చేస్తున్న కలివేముల వీరేశం గౌడ్
నామినేషన్ దాఖలు చేస్తున్న ఎం. శివ కుమార్

కొండాపూర్ 104 డివిజన్ లో…
టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గా షేక్ హమీద్ పటేల్, రెబెల్ అభ్యర్థులుగా షేక్ అబ్దుల్, నీలం రవీందర్ ముదిరాజ్ లు నామినేషన్ లు వేయగా బిజెపి నుండి ఎం.రఘునాథ్ యాదవ్, చంద్ర శేఖర్ యాదవ్ లు నామినేషన్ లు సమర్పించారు. కాంగ్రెస్ పార్టీ నుండి గంగల మహిపాల్ యాదవ్, గంగల మానస మహిపాల్ యాదవ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు. టిడిపి నుండి సిరాజ్, ఎం ఐ ఎం పార్టీ నుండి షేక్ ఖాజా హుస్సేన్, ఇండియా ప్రజాబంధు పార్టీ నుండి జలీల్ అహ్మద్, సిపిఐ పార్టీ నుండి కనకమామిడి శ్రీశైలం గౌడ్, స్వతంత్ర అభ్యర్థులుగా సయ్యద్ రియాజ్, సాజిదా బేగం, జి.శ్రీధర్, ఎం.హరీష్, సంపాతి ప్రభాకర్, జనపాల దుర్గ ప్రసాద్ లు నామినేషన్ లు దాఖలు చేశారు. డివిజన్ నుండి మొత్తంగా 17 మంది అభ్యర్థులు 20 నామినేషన్ లు దాఖలు చేశారు.

టిఆర్ఎస్ రెబెల్ అభ్యర్థి గా నామినేషన్ దాఖలు చేస్తున్న నీలం రవీందర్ ముదిరాజ్
శేరిలింగంపల్లి బిజెపి అభ్యర్థి గా నామినేషన్ దాఖలు చేస్తున్న రాజు శెట్టి

గచ్చిబౌలి 105 డివిజన్ లో…
టిఆర్ఎస్ పార్టీ నుండి పార్టీ అభ్యర్థి కొమిరిశెట్టి సాయిబాబా, రెబెల్ అభ్యర్థి గా ఎన్.గణేష్, బిజెపి పార్టీ నుండి గంగాధర్ రెడ్డి, డి.రవీందర్, నీరుడి సురేష్, నీలం నరేందర్ కుమార్ , నక్క నరేందర్ గౌడ్, కే. వెంకటేష్, కే. గణేష్, రవీంద్ర ప్రసాద్, ఎం.స్వామి, మూల అనిల్ గౌడ్, మట్ట సురేష్, చిలుముల రామారావు లు నామినేషన్ లు సమర్పించారు. కాంగ్రెస్ పార్టీ నుండి కే.అరుణ కుమారి, మట్ట సురేష్, కొండా రవి గౌడ్, అర్కల భరత్ కుమార్, సంగం ప్రవీణ్ కుమార్ గౌడ్ లు, దళిత బహుజన పార్టీ నుండి అర్షాల రాజు, స్వతంత్ర అభ్యర్థులుగా రావులకొల్లు శ్రీకాంత్, పి.చంద్రమౌళిలు నామినేషన్ లు సమర్పించారు. మొత్తంగా ఈ డివిజన్ నుండి 22 మంది అభ్యర్థులు 35 నామినేషన్ లు దాఖలు చేశారు.

శేరిలింగంపల్లి డివిజన్ అభ్యర్థి గా నామినేషన్ దాఖలు చేస్తున్న రవి యాదవ్
గచ్చిబౌలి టిఆర్ఎస్ రెబెల్ గా నామినేషన్ దాఖలు చేస్తున్న నిరుడి గణేష్ ముదిరాజ్

శేరిలింగంపల్లి (106 ) డివిజన్ లో…
బిజెపి నుండి ఏ.కుమార్, కే.శ్రీనివాస్, కే.ఎల్లేష్, ఎం.రవి, రాజు శెట్టి లు నామినేషన్ లు దాఖలు చేయగా  టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా రాగం నాగేందర్ యాదవ్ నామినేషన్ పత్రాలను సమర్పించారు. కాంగ్రెస్ పార్టీ నుండి మడుపతి శివ, శామ్యూల్, టిడిపి నుండి ఏరువ సాంబశివ గౌడ్, మహమ్మద్ హబీబ్, రేవళ్ల రాజేష్ ఎంసిపిఐ యు నుండి మధుసూదన్, ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ నుండి యాసీన్ బాషా, స్వతంత్ర అభ్యర్థులు గా బి.విజయ లక్ష్మి, కే.వీరేశం, నల్లగంటి మల్లేశం, ప్రేమ్ కుమార్, విజయ లక్ష్మి, సయ్యద్ నిజాముద్దీన్, పి,మహేశ్వర్, డి.సతీష్ కుమార్, గుంజి వాసులు నామినేషన్ లు దాఖలు చేశారు. డివిజన్ నుండి మొత్తంగా 24 మంది అభ్యర్థులు 32 నామినేషన్ లు దాఖలు చేసారు.

ఎంఐఎం పార్టీ అభ్యర్థి గా నామినేషన్ దాఖలు చేస్తున్న షేక్ ఖాజా హుస్సేన్

 

రిట‌ర్నింగ్ అధికారికి నామినేష‌న్ ప‌త్రాల‌ను అంద‌జేస్తున్న విలేక‌రి న‌ల్ల‌గంటి మ‌ల్లేశం

 

Advertisement

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here