టీఆర్ఎస్ పార్టీలోకి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోడిచెర్ల టి కృష్ణ

పార్టీలో చేరిన కోడిచెర్ల టి.కృష్ణ ఆయన అనుచరులతో ప్రభుత్వ విప్ గాంధీ, ఎమ్మెల్యే షకీల్ అహ్మద్

కొండాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆ పార్టీ సీనియర్ నాయకుడు కోడిచెర్ల టి.కృష్ణ టిఆర్ఎస్ పార్టీలో చేరారు. శుక్రవారం సాయంత్రం ప్రభుత్వ విప్ గాంధీ బోధన్ శాసనసభ్యులు షకీల్ అహ్మద్, టిఆర్ఎస్ కొండాపూర్ డివిజన్ అభ్యర్థి హమీద్ పటేల్ ల సమక్షంలో వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలే రాష్ట్రంలో నాయకులను ప్రజలను ఆకర్షిస్తున్నాయన్నారు. శేరిలింగంపల్లి నియోజక వర్గంలో టిఆర్ఎస్ పార్టీ రోజురోజుకు బలోపేతమవుతుందని తెలిపారు జిహెచ్ఎంసి ఎన్నికల్లో నియోజకవర్గం పరిధిలోని అన్ని స్థానాలను భారీ మెజారిటీతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీలో చేరిన వారిలో సయ్యద్ అహ్మద్, కలీం భాయ్, కె. బసవరాజు, జి సురేష్ తదితరులు ఉన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here