బిజెపి మహిళా మోర్చా రంగారెడ్డి అర్బన్ జిల్లా ఉపాధ్యక్షురాలిగా బీమని విజయ లక్ష్మి

నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి రంగారెడ్డి అర్బన్ జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలిగా శేరిలింగంపల్లి డివిజన్ కు చెందిన బీమని విజయ లక్ష్మి నియమితులయ్యారు. గతంలో ఆమె శేరిలింగంపల్లి మహిళా మోర్చా కో కన్వీనర్‌గా పనిచేశారు. ఈ సందర్భంగా బిజెపి రంగారెడ్డి అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి, మహిళా మోర్చా ఇంచార్జ్ వై.శ్రీధర్‌ బుధవారం విజయలక్ష్మిని ఉపాధ్యక్షులురాలిగా నియమిస్తూ నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా భీమని విజయలక్ష్మి శ్రీధర్ తో పాటు బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి అప్పజెప్పిన బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తానని, జిల్లాలో పార్టీ పటిష్టతకు పాటుపడతానని అన్నారు.

అర్బన్ జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలిగా నియామక పత్రం అందుకుంటున్న బీమని విజయ లక్ష్మి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here