కాలనీల అభివృద్ధికి విశేషంగా  కృషి చేస్తాం: ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధిలోని మార్తాండ్ నగర్ కాలనీ లో హాఫిజ్ పేట్ మున్నూరు కాపు సంఘం భవన నిర్మాణం కోసం రూ. 21 లక్షల అంచనా వ్యయంతో ఎమ్మెల్యే (CDP FUNDS ) నిధులతో నిర్మించేందుకు.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ పంపిన మంజూరి పత్రాలను మున్నూరు కాపు సంక్షేమ సంఘం సభ్యులకు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అందజేశారు.

మున్నూరు కాపు సంక్షేమ సంఘం సభ్యులకు మంజూరి అందజేస్తున్న ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ

ఈ సందర్బంగా మాట్లాడుతూ కాలనీల అభివృద్ధికి విశేషంగా  కృషి చేస్తానని, మరిన్ని నిధులు కేటాయించడానికి సిద్ధమని, తన దృష్టికి వచ్చిన సమస్యలు పరిష్కరిస్తానని పేర్కొన్నారు. ఈ సందర్బంగా  హాఫిజ్ పెట్ మున్నూరు కాపు సంఘం సభ్యులు  మాట్లాడుతూ మేము అడిగిన వెంటనే భవనం నిర్మాణానికి సహాకరించిన ప్రభుత్వ విప్ గాంధీకి  కాలనీ వాసుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపామని చెప్పారు. ఎమ్మెల్యే గాంధీ శేరిలింగంపల్లి నియోజకవర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని  కొనియాడారు. ఈ కార్యక్రమంలో హాఫిజ్ పేట్ మున్నూరు కాపు సంఘం సభ్యులు చైర్మన్ కొన్నవేణి రమేష్, ప్రెసిడెంట్ పొగుల సత్యనారాయణ, జనరల్ సెక్రటరీ వాసాల శ్రీనివాస్, పేరుక రమేష్, బుడుగు తిరుపతి రెడ్డి, గాజుల మహేందర్, బొల్లం సంతోష్, బత్తుల సంతోష్ పాల్గొన్నారు.

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here