పార్టీకి కార్యకర్తలే బలం, బలగం : ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి : పార్లమెంట్ ఎన్నికల ముగిసిన తదనంతరం మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ కు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఎమ్మెల్యే గాంధీ అభినందించారు. అనంతరం మాట్లాడాతూ.. ప్రజాస్వామ్యంతో అత్యంత కీలకమైన ఓటు హక్కును బాధ్యతాయుతంగా వినియోగించుకున్న నియోజకవర్గ ఓటర్లతోపాటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, నాయకులకు, కార్యకర్తలకు బీఆర్‌ఎస్ అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన స్వల్ప కాలంలోనే పార్లమెంటు ఎన్నికలు వచ్చినప్పటికీ తనకు అఖండ మెజార్టీ అందించటమే కాకుండా.. బీఆర్‌ఎస్ చేవెళ్ల అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపుకోసం నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు తామే అభ్యర్థిలా భావించి అలుపెరగకుండా శ్రమించారన్నారు.

ఎమ్మెల్యే గాంధీని కలిసిన మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ కు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు

మున్ముందు ఎన్నికలలోనూ ఇదే స్ఫూర్తిని చాటాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సాంబయ్య, సంజీవ రెడ్డి, శివాజీ, ప్రకాష్ రెడ్డి, దుర్గారావు, పూర్ణ, హరిబాబు, సుబ్బారావు, రాంమోహన్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, దేవా, వెంకటేశ్వరరావు, వసంత్, అశోక్, రాజేష్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here