- ఎమ్మెల్యే గాంధీకి వినతిపత్రం సమర్పించిన శ్రీరామ్ నగర్ ఏ బ్లాక్ కాలనీ వాసులు
నమస్తే శేరిలింగంపల్లి : తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ శ్రీరామ్ నగర్ ఏ బ్లాక్ కాలనీ వాసులు ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినవతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ స్పందించి మేనేజర్ సందీప్ తో ఫోన్ ద్వారా మాట్లాడి సమస్యను త్వరితగతిన పరిష్కరించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని, మంచి నీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలను తీసుకోవాలని ఆదేశించారు.
మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని, ప్రజలకు స్వచ్చమైన తాగునీరు అందించడమే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. అదేవిధంగా కాలనీలో నెలకొన్న పలు సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని, కాలనీలో అసంపూర్తిగా మిగిలిపోయిన డ్రైనేజీ, రోడ్డు పనులు త్వరలోనే పూర్తి చేస్తామని, శ్రీ రామ్ నగర్ కాలనీ అభివృద్ధికి శాయాషక్తులా కృషి చేస్తానని చెప్పారు.
ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ బలరాం , కాలనీ వాసులు పాల్గొన్నారు.