సీసీ రోడ్డు పనుల పరిశీలన

శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కు ధన్యవాదాలు తెలిపిన కాలనీవాసులు
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ లోని రాజీవ్ గృహకల్పలో పూర్తయినా సీసీ రోడ్డు నిర్మాణం పనులను శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పరిశీలించారు. రాజీవ్ గృహకల్ప వార్డు మెంబర్ శ్రీకళ, స్థానిక నాయకులతో, మహిళా నాయకురాళ్లతో కలిసి వెళ్లి పరిశీలించగా.. ఈ సందర్భంగా స్థానిక కాలనీవాసులు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కు ధన్యవాదాలు తెలిపారు.

మిగిలిన సిసి రోడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాక కాలనీలోని సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ శ్రీకళ, చంద్రకళ, యోగి, మహేందర్, సుధాకర్, బసవయ్య, షఫీ, హరి, శ్రీను, సురేష్, సత్తర్, వెంకట్ రెడ్డి, కుటుంబరావు, జమ్మయ్య, మహిళా నాయకురాళ్లు దీప, కుమారి, సుధారాణి, గౌసియా, ఫాతిమ, శశికళ, సుజాత, స్వరూప, కళ్యాణి, లక్ష్మి, కాలనీవాసులు పాల్గొన్నారు.

రాజీవ్ గృహకల్పలో పూర్తయినా సీసీ రోడ్డు నిర్మాణం పనుల వివరాలను తెలుసుకుంటున్న కార్పొరేటర్ నాగేందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here