ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి సత్కారం

నమస్తే శేరిలింగంపల్లి : బీఆర్ఎస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గ అభ్యర్థిగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని ప్రకటించిన విషయం విదితమే. ఇందులో భాగంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, పలు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో ఆయనను తన నివాసంలో కలిసి గజమాలతో సత్కరించి, బాణా సంచా కాల్చి, స్వీట్లు పంచి శుభాకాంక్షలు తెలిపారు.

తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరింత బాధ్యతతో రెట్టింపు ఉత్సహంతో పనిచేసి మూడో సారి భారీ మెజారిటీ తో గెలిచి శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అగ్రగామి గా నిలబెడతానని తెలిపారు. తన వెన్నంటి నిలిచిన శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజానీకానికి, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, కార్పొరేటర్లకు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులకు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు , వార్డ్ మెంబర్లకు, ఏరియా కమిటీ ప్రతినిధులకు, ఉద్యమకారులకు, పాత్రికేయ మిత్రులకు, అభిమానులకు, శ్రేయభిలాషులకు, కాలనీల అసోసియేషన్ సభ్యులకు, కాలనీ వాసులకు హృదయపూర్వక కృతఙ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేయభిలాషులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here