పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని ఎం కె ఆర్ స్కూల్ లో చందానగర్ మున్సిపల్ అధికారులు, ఎం కె ఆర్ స్కూల్ యాజమాన్యం సంయుక్తంగా స్వచ్ఛ భారత్ స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విధ్యార్థి దశ నుంచి పరిసరాలు పరిశుభ్రం పై అవగాహనా పెంచుకోవాలని, మనం బాగుండాలి అంటే మన చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సుచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ మహనగరానికి వరల్డ్ గ్రీన్ సిటి అవార్డు లభించిందన్నారు. అదేవిధంగా హైదరాబాద్ నగరాన్ని స్వచ్ఛ హైదరాబాద్ విశ్వనగరంగా తీర్చిద్దాడనికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎం కె ఆర్ స్కూల్ యాజమాన్యం జిహెచ్ ఎం సి అధికారులు పాల్గొన్నారు.

ఎం కె ఆర్ స్కూల్ లో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతున్న కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here