- పార్కింగ్ రుసుం వసూలు చేసినందుకు జీహెచ్ఎంసీ చర్యలు
నమస్తే శేరిలింగంపల్లి : జీవో 63 నియమ నిబంధనలను ఉల్లంఘించినందుకు జీహెచ్ఎంసీ భారీ జరిమానా విధించింది. షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్స్లో ఫ్రీ పార్కింగ్ సదుపాయం ఉన్న విషయం తెలిసిందే.
![](https://namastheslp.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-23-at-1.22.45-PM.jpeg)
అయితే ఈ నిబంధనలకు విరుద్ధంగా మియాపూర్ లోని సినీటౌన్ (మిరాజ్ సినిమాస్) పార్కింగ్ రుసుం వసూలు చేస్తున్నది. ఈ విషయం జీహెచ్ఎంసీ దృష్టికి రావడంతో రూ. 50 వేల జరిమానా విధించి హెచ్చరించింది. మరోసారి పునరావృమైతే చర్యలు కఠినంగా ఉంటాయన్నారు.