సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టండి : కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎ.ఏస్. రాజు నగర్, మహోధాయ ఎన్ క్లేవ్ కాలనీలలో గత వర్షాకాలంలో తలెత్తిన సమస్యలు పునరావృతం కాకుండా నూతనంగా (Storm water drain) వరద నీటి కాలువ నిర్మాణం చేపట్టబోయే పరిసర ప్రాంతాలను స్థానికులతో కలసి కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎ.ఏస్.రాజు నగర్, మహోధాయ ఎన్ క్లేవ్ కాలనీలలో గత వర్షాకాలంలో తలెత్తిన సమస్యలు పునరావృతం కాకుండా నూతనంగా (Storm water drain) వరద నీటి కాలువ నిర్మాణం పనులు చేపట్టే పరిసర ప్రాంతాలను కాలనీ వాసులతో కలసి పరిశీలించామని, నూతనంగా నిర్మాణం చేపట్టబోయే పనులను త్వరగా ప్రారంభించి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

ఎ.ఏస్.రాజు నగర్, మహోధాయ ఎన్ క్లేవ్ కాలనీలలో పర్యటించి సమస్యలు తెలుసుకుంటున్న కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

గడిచిన వర్షాకాలంలో ముంపుకు గురైన కాలనీలను దృష్టి లో వుంచకొని, భవిషత్తులో వరద నీటి సమస్యలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు చొక్కా రావు, రాజు, జిహెచ్ఎంసి వర్క్ ఇన్స్పెక్టర్లు నవీన్, అన్వర్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here