మియాపూర్ జెడ్పిహెచ్ఎస్  పాఠశాల సమస్యలు పరిష్కరించాలి

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలోని సమస్యలను పరిష్కరించాలని ఏఐఎఫ్ డిఎస్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి ఎంఈఓ వెంకటయ్యను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఏఐఎఫ్ డిఎస్ రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి మాట్లాడుతూ మియాపూర్ జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో దాదాపు 950 మంది విద్యార్థులు ఉన్నారని, ఒక సంవత్సరం ముందే నూతన భవనాన్ని ప్రారంభించిన ప్రభుత్వం బడ్జెట్ లేక ఇప్పటివరకు భవనం పూర్తి చేయక పోవడం వల్ల తరగతి గదులు సరిపోక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో నాయకుడు మోతే సంతోష్ పాల్గొన్నారు.

శేరిలింగంపల్లి ఎంఈఓ కి వినతి పత్రం అందజేసిన ఏఐఎఫ్ డిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here