నేడు నిరుద్యోగులకు మెగా జాబ్ మేళా

  • సద్వినియోగం చేసుకోవాలని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పిలుపు

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో నేడు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. నిరుద్యోగ యువతకు కల్పిస్తున్న ఈ అవకాశాన్ని అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. బిగ్ బాస్కెట్ సంస్థలో 500పైగా ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లు తెలిపారు.  ట్రాన్స్ జెండర్లకు, చెవిటి, మూగ వాళ్ళకి కూడా అవకాశాలు కలవు.

కొండాపూర్ (మస్జీద్ బండ) జెడ్పీహెచ్ ఎస్ లో ఉదయం 10 నుండి సాయంత్రం 6 గంటల వరకు జరగనున్నది. పదవ తరగతి, ఇంటర్మీడియెట్, అండర్ గ్రాడ్యుయేట్ డిప్లొమా హోల్డర్స్, బిఫార్మా, ఎం ఫార్మా, హోటల్ మేనేజ్మెంట్, డ్రైవర్స్ అర్హులని తెలిపారు. ఇతర సమాచారం కోసం 8885621063, 8106319077, 9177121181 నెంబర్లలో సంప్రదించాలని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here