- మెడికవర్ ఉమన్ & చైల్డ్ హాస్పిటల్స్, ఆహా క్లీనిక్స్ ఆధ్వర్యంలో 18 నుంచి 24వ తేదీ వరకూ ఉచిత పరీక్షలు
- సద్వినియోగం చేసుకోవాలని మెడికవర్ ఉమన్ & చైల్డ్ హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ & అబ్సెస్ట్సీషియన్ డాక్టర్ ఎస్వీ లక్ష్మీ పిలుపు
నమస్తే శేరిలింగంపల్లి : మెడికవర్ ఉమన్ & చైల్డ్ హాస్పిటల్స్, ఆహా క్లీనిక్స్ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు మహిళలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు, సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 5 నుంచి రాత్రి 8గంటలకు వరకు గచ్చిబౌలిలోని టెలికామ్ మెయిన్ వద్ద ఆహా క్లినిక్స్ లో నిర్వహించబడునని మెడికవర్ ఉమన్ & చైల్డ్ హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ & అబ్సెస్ట్సీషియన్ డాక్టర్ ఎస్వీ లక్ష్మీ (ఎంబీబీఎస్, డీజీఓ, డీఎన్బీ) తెలిపారు.
ఈ నెల 18 నుంచి 24వ తేదీ వరకూ ఉచితంగా చేపట్టే ఈ శిబిరంలో రుతుస్రావం క్రమం తప్పడం, తెల్ల బట్ట, కలయికలో నొప్పి, యోనివద్ద ఇన్ఫెక్షన్స్, హార్మోన్ సమస్యలు, సంతానలేమి, యుక్తవయసులో సమస్యలు, కడుపునొప్పితో కూడిన జ్వరంతో బాధపడే వారికి చికిత్సలు చేయనున్నట్లు తెలిపి సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అంతేకాక గైనకాలజిస్ట్ కన్సల్టేషన్, పాప్స్మెర్ టెస్ట్, రాండమ్ బ్లడ్ షుగర్ ఉచితంగా చేయనున్నట్లు పేర్కొన్నారు.