మహోత్సవంగా శ్రీ నాభిశీల బొడ్రాయి ప్రతిష్టాపన

  • పాల్గొని పూజలు చేసిన శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోనీ గోపనపల్లి గ్రామంలో శ్రీ నాభిశీల బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవంగా జరిగింది. ఈ మహోత్సవంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

గోపనపల్లి గ్రామంలో శ్రీ నాభిశీల బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవంలో పూజలు చేస్తున్న శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్

బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని, గ్రామంలోని ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, ఎలాంటి అశుభాలు జరుగకుండా ఉండాలని పూర్వకాలంలో పెద్దలు బొడ్రాయిని ప్రతిష్టించే వాళ్ళని తెలిపారు. ఏదైనా వేరే గ్రామానికి వెళ్ళాలన్నా, వేరే గ్రామం నుండి వచ్చేవాళ్ళైనా బొడ్రాయిని పూజించే వాళ్ళని పేర్కొన్నారు. గ్రామంలోకి ఏ దుష్టశక్తులు గ్రామంలోకి రాకుండా బొడ్రాయి కాపాడుతుందని పెద్దల నమ్మకం అని తెలిపారు. మధ్యలో దీనిపై కొంత అశ్రద్ధ వహించడం వల్ల, నేటి తరానికి అవగాహనా లేకుండా పోయిందన్నారు. అమ్మవారి ఆశీర్వాదం ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు.

జగదీశ్వర్ గౌడ్ తో..

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రఘునందన్ రెడ్డి, సురేందర్, శేఖర్ రెడ్డి, పోచయ్య, రవీందర్ ప్రసాద్ దుబే, చలపతి రావు, చంద్రమౌళి, నరసింహ, గోపనపల్లి వాసులు, స్థానిక భక్తులు, మహిళలు, పిల్లలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here