ఆలయ అభివృద్ధి కి కృషి చేస్తా : ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి : గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని మధురనగర్ లోని ఎదురుగడ్డల మైసమ్మ అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేయబోయే వాచ్ మెన్ రూమ్ కి , దేవస్థానం ప్రహరీ నిర్మాణానికి మాజీ కార్పొరేటర్ సాయిబాబాతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ప్రజల, భక్తుల సౌకర్యార్థం ఆలయ అభివృద్ధి కి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని, ఆలయ అభివృద్ధికి విశేషం గా కృషి చేస్తానన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, సోమేశ్వర దేవస్థానం చైర్మన్ చెన్నం రాజు తెరాస నాయకులు నరేశ్, జంగయ్య యాదవ్, రమేష్ గౌడ్, జగదీష్, రావులకొలు గోవింద్, అంజమ్మ, ఏరియా కమిటీ సభ్యులు నాగపూరి అశోక్ యాదవ్, శామ్లెట్ శ్రీనివాస్, అనిల్ సింగ్, మధు, నాగేష్, ప్రభాకర్, సుగుణ, బాలమణి, మాధవి గ్రామస్థులు పాల్గొన్నారు.

అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేయబోయే వాచ్ మెన్ రూమ్ కి , దేవస్థానం ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ
అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో అమ్మవారికి పూజలు చేసిన ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here