నమస్తే శేరిలింగంపల్లి: శిల్పారామం మాదాపూర్ లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా నిర్వహించిన భరతనాట్యం, కూచిపూడి నృత్యాలు ఎంతగానో అలరించాయి.
బెంగళూరు నుండి విచ్చేసిన భరతనాట్య కళాకారిణి రజిత కృష్ణ నృత్య ప్రదర్శనలో మహాదేవ సుతం, రామాయణ శబ్దం, ఎవడెయ్ ఓ భామ పదం, కదనాకుతూహల తిల్లాన అంశాలను ప్రదర్శించి మెప్పించారు. మయూరి కూచిపూడి నృత్యాలయ శ్రీదేవి శిష్య బృందం గణేశా పంచరత్న, శరణుసిద్ది, కూచిపూడి సలాం, వేదములెయ్ నీ నివాసమంతా, ఒకపరి కొకపరి, కృష్ణ శబ్దం, పలుకీ బంగారమయేహ్న, తిల్లాన అంశాలను నందిత రాజనాల, పల్లవి, అర్చన, మనస్విని, సహస్ర, ఆశ్రిత, సంయుక్త, విరూప, లౌక్య, దీక్షిత, కార్తీక, ప్రదీక్ష ప్రదర్శించి మెప్పించారు.