ముగిసిన గాంధీ శిల్ప బజార్ నేషనల్, సంక్రాంతి సంబురాలు

నమస్తే శేరిలింగంపల్లి : శిల్పారామం మాదాపూర్ లో గాంధీ శిల్ప బజార్ నేషనల్, సంక్రాంతి సంబురాలు ఘనంగా ముగిశాయి. భారతదేశం లోని వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన చేనేత హస్తకళాకారులు తమ వెంట తెచ్చిన ఉత్పత్తులు ఎంతో ఆకట్టుకున్నాయి. అత్యధికంగ అమ్ముడయ్యాయి.

కళాకారుల నృత్య ప్రదర్శన

అంతేకాక అక్కడ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా అంజు అరవింద్ శిష్యబృందం భరతనాట్య ప్రదర్శన, వరంగల్ నుండి విచ్చేసిన నాట్య గురువర్యులు తాడూరి రేణుక శిష్య బృందం కూచిపూడి, జానపద నృత్యాలు ఎంతగానో అలరించాయి. వినాయక కౌతం, బ్రహ్మాంజలి, అన్నమాచార్య కీర్తనలు, దశావతారాలు, శంకర శ్రీగిరి, రేపల్లె వాడలకు, ఘల్లు ఘల్లు మొదలైన అంశాలను కళాకారులు ప్రదర్శించి మెప్పించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here