అప్రమత్తంగా ఉండండి.. అవసరమైతే బయటికి రండి: ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితి వస్తే తప్ప ఇంటి నుండి బయటకు రావొద్దని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సూచించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంపు ప్రాంతాలలో కలిగే సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి ఆయా ప్రాంతల్లో పర్యటించి, పరిశీలించి, సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

నాలా వద్ద పరిస్తిని సమీక్షిస్టున్న ఎమ్మెల్యే గాంధీ

ప్రతి ఒక్కరు కనీస స్వీయ రక్షణ చర్యలు పాటించాలని పిలుపునిచ్చారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వర్షపు నీరు నిలిచిపోవడం తో హుటాహుటిన అక్కడికి వెళ్లి సమస్యను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, GHMC ఇంజనీరింగ్ విభాగం అధికారుల తో కలిసి పరిశీలించి మాట్లాడారు. లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద నీటి ప్రవాహం సాఫీగా సాగేలా చూడాలని, అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జీహెచ్ ఎంసి అధికారులు ఈ ఈ జికేడి ప్రసాద్, డి ఈ రమేశ్ ఏఈ భాస్కర్, మాజీ కౌన్సిలర్ వీరేశం గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జనార్దన్ రెడ్డి, యాదగిరి గౌడ్, నాయి నేనీ చంద్రకాంత్ రావు, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, గోపాల్ యాదవ్, రవి యాదవ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here