చైత్ర కుటుంబానికి న్యాయం జరగాలని యూత్ కాంగ్రెస్ కొవ్వొత్తుల ర్యాలీ

నమస్తే శేరిలింగంపల్లి: చిన్నారి చైత్రపై జరిగిన ఘటనకు నిరసనగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. చందానగర్ గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నివాళి తెలిపి చి‌న్నారి చైత్ర కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. ఆరేళ్ల చిన్నారి చైత్రపై అత్యాచారం చేసి హత్య చేసిన నింధితున్ని ఉరి తీయాలని డిమాండ్ చేశారు. మహిపాల్ యాదవ్, మారెళ్ల శ్రీనివాస్, సురేష్ నాయక్, మైనారిటీ విభాగం చైర్మన్ జహంగీర్, అయాజ్ ఖాన్, అజీముద్దీన్, యూత్ కాంగ్రెస్ నాయకులు సౌందర్య రాజన్, శ్రీహరి గౌడ్, దుర్గేష్, సాయి కిషోర్, అసద్, చిరంజీవి రెడ్డి, రాజేష్ గౌడ్, సలీమ్, ముషారఫ్, ఫయాజ్, ఖాజా తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్న యూత్ కాంగ్రెస్ నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here