ఘనంగా యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం – కాంగ్రెస్ జెండా ఆవిష్కరించి కేకు‌ కట్ చేసిన శేరిలింగంపల్లి యూత్ కాంగ్రెస్ నేతలు

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో యువజన కాంగ్రెస్ 62 వ ఆవిర్భావ దినోత్సవాన్ని యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు సౌందర్య రాజన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ జెండా ఎగరవేసి, నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు. సౌందర్య రాజన్ మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాటంలో యువజన కాంగ్రెస్ కు ఎన్నో పోరాటాలు చేసిన ఘనత ఉందన్నారు.

యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మాట్లాడుతున్న సౌందర్య రాజన్

స్వాతంత్ర్య అనంతరం ఎన్నో ప్రజాపోరాటాలు చేసి యువత, ప్రజల సమస్యల పరిష్కారం దిశగా ప్రయత్నం చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సత్యం రావు, డివిజన్ అధ్యక్షుడు మరేళ్ల శ్రీనివాస్, సురేష్ నాయక్, రేణుక, జమీర్, హరికిషన్, పోచయ్య, రాజేందర్, శ్రీహరి గౌడ్, శామ్యూల్ కార్తీక్, అల్లావుద్దీన్ పటేల్, రావేళ్ళ రాజేష్, యువజన కాంగ్రెస్ నాయకులు రాజేశ్ గౌడ్, సాయి కిషోర్, దుర్గ దాస్, శామ్యూల్, సలీం, సురేష్ రాథోడ్, శివ, అప్రోజ్, ఖాజా, రాజేశ్ నాయక్, పీటర్, తదితరులు పాల్గొన్నారు.

కేకు కట్ చేస్తున్న యువజన కాంగ్రెస్ నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here