గౌలిదొడ్డిలో ఘనంగా అమ్మ వారి పలహార బండి ఊరేగింపు

నమస్తే శేరిలింగంపల్లి: బోనాల పండగ తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదొడ్డిలో నిర్వహించిన బోనాల ఉత్సవాలలో భాగంగా దార్గుపల్లి అనిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమంలో నార్సింగ్ మున్సిపల్ చైర్మన్ రేఖ యాదగిరి, తీన్మార్ మల్లన్న, స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, గచ్చిబౌలి డివిజన్ కిసాన్ మోర్చా అధ్యక్షులు కిషన్ గౌలి, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి, సీనియర్ నాయకులు రంగస్వామి, బలరాం, దేవాలయ కమిటీ సభ్యులు, గౌలిదొడ్డి గ్రామం వాసులు, కేశవ నగర్ గ్రామం వాసులు, స్థానిక నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

గౌలిదొడ్డి లో నిర్వహించిన పలహార బండి ఊరేగింపులో పాల్గొన్న తీన్మార్ మల్లన్న, గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here