బిజెపి రాష్ట్ర ఫైనాన్స్ కమిటీ మెంబర్ గా యోగానంద్

నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగియడం, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో బహిరంగ సభ సక్సెస్ అవడంతో రాష్ట్ర అధినాయకత్వం మరింత ఉత్సాహంతో పనిచేసేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటుంది. అందులో భాగంగా రాష్ట్ర స్థాయిలో పలు కమిటీలను వేయగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిటీ సభ్యులుగా శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జీ గజ్జల యోగానంద్ ను బిజెపి అధిష్టానం నియమించింది. రాష్ట్ర ఫైనాన్స్ కమిటీ కన్వీనర్ గా జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిని నియమించారు. రాష్ట్ర ఫైనాన్స్ కమిటీ లో తనకు స్థానం కల్పించినందుకు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు శేరిలింగంపల్లి నుంచి గజ్జల యోగానంద్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను తప్పకుండా నిర్వర్తించి బిజెపి బలోపేతానికి మరింత కృషి చేస్తానని చెప్పారు.

బిజెపి రాష్ట్ర ఫైనాన్స్ కమిటీ మెంబర్ గా నియమితులైన యోగానంద్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here