ఈటల రాజేందర్ కు నవతా రెడ్డి శుభాకాంక్షలు

నమస్తే శేరిలింగంపల్లి: భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర చేరికల సమన్వయ కమిటీ కన్వీనర్ గా నియమితులైన హుజురాబాద్ శాసనసభ్యులు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్ కు చందానగర్ మాజీ కార్పొరేటర్, బీజేపీ నాయకులు‌ బొబ్బ నవతా రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈటల రాజేందర్ ను ఆయన స్వగృహంలో కలిసి శాలువాతో సత్కరించి పూలమొక్కను అందజేశారు. ఈటల రాజేందర్ కు రాష్ట్ర చేరికల సమన్వయ కమిటీ కన్వీనర్‌గా నియమించడం సంతోషకరమని అన్నారు.‌ ఉద్యమ నేపథ్యం ఉన్న ఈటల రాజేందర్ రాబోయే రోజుల్లో చాలా మంది ఆయా పార్టీల నాయకులను బీజేపీలోకి చేర్పించే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బొబ్బ విజయ్ రెడ్డి, పోచయ్య, గౌస్, అనంత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈటల‌ రాజేందర్ కు శుభాకాంక్షలు తెలిపిన చందానగర్ మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here