మియాపూర్ డివిజ‌న్ అభివృద్ధికి కృషి : కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్రీ‌కాంత్‌

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 19 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తాన‌ని డివిజన్ కార్పొరేటర్, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. డివిజన్ పరిధిలోని హెచ్ఎంటీ కాలనీ, శ్రీ లక్ష్మీ నగర్ కాలనీల‌ అసోసియేషన్ సభ్యులు శ్రీకాంత్ ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సంద‌ర్భంగా హెచ్ఎంటీ, శ్రీ లక్ష్మీ నగర్ కాలనీలలో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనుల విషయమై కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ కి కాలనీల అసోసియేషన్ సభ్యులు వినతిపత్రం అందజేశారు. హెచ్ఎంటీ కాలనీ, శ్రీ లక్ష్మీ నగర్ కాలనీలో అసంపూర్తి మిగిలిపోయిన రోడ్ల నిర్మాణం పనులను పూర్తిచేయాలని, మంచినీటి వసతిని మెరుగుపర‌చాలని కోరారు. భూగర్భ డ్రైనేజీ పైప్ లైన్ నిర్మాణం పనులు చేపట్టాలని అన్నారు.

కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్రీ‌కాంత్‌కు విన‌తిప‌త్రం అంద‌జేస్తున్న కాల‌నీల వాసులు

అనంతరం కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని హెచ్ఎంటీ కాలనీ, శ్రీ లక్ష్మీ నగర్ కాలనీల అసోసియేషన్ సభ్యులు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సహకారంతో కాలనీలో నెలకొన్న వివిధ సమస్యలను దశలవారిగా పరిష్కరిస్తామని తెలిపారు. కాలనీలో అసంపూర్తిగా మిగిలిపోయిన యూజీడీ పనులను, సీసీరోడ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేస్తామని అన్నారు. మంజీర మంచినీటి వసతిని మెరుగుపరుస్తామని తెలిపారు.హెచ్ఎంటీ కాలనీ, శ్రీ లక్ష్మీ నగర్ లో దశలవారిగా అన్ని పనులు పూర్తిచేసి కాలనీల‌లో చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామని కార్పొరేటర్ తెలిపారు. డివిజన్ ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉండడం జరుగుతుందని, డివిజన్ ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా తన‌ దృష్టికి తీసుకురావాలని అన్నారు. మెరుగైన ప్రజా జీవనానికి అన్నిరకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషిచేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంటీ కాలనీ, శ్రీ లక్ష్మీ నగర్ కాలనీల వాసులు దేవేందర్ రావు, విరుపాక్షయ్య‌, అద్దంకి బాలు చౌదరి, బీఆర్ చౌదరి పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here