కార్మికుల శ్ర‌మ‌కు త‌గిన గౌర‌వం ఎల్ల‌ప్పుడూ ఉండాలి: రవికుమార్ యాదవ్

శేరిలింగంపల్లి, మే 1 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): కార్మికుల అవిరళ కృషి, పట్టుదల, సమాజానికి వెన్నెముకలా నిలుస్తున్నాయ‌ని, వారి శ్రమకు తగిన గుర్తింపు, గౌరవం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాన‌ని శేరిలింగంప‌ల్లి బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే, కార్యవర్గ సభ్యుడు రవికుమార్ యాదవ్ అన్నారు. గచ్చిబౌలి డివిజన్ లో ప్రపంచ కార్మికుల దినోత్సవ సందర్భంగా సానిటేషన్ SRP నరసింహ ఆహ్వాన మేరకు కార్మికుల ఐక్యతను చాటుతూ జెండా ఆవిష్కరించి GHMC పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు.

ఈ సందర్భంగా రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఈరోజు ప్రత్యేకమైన రోజు అని, కార్మికుల హక్కుల కోసం పోరాడిన వారిని స్మరించుకుంటూ వారి త్యాగాల ఫలితంగానే నేడు మనం మెరుగైన పని పరిస్థితులను అనుభవిస్తున్నామ‌ని అన్నారు. ఆ పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ, అందరికీ సమానమైన అవకాశాలు, న్యాయమైన వేతనాలు, సురక్షితమైన పని వాతావరణం ఉండేలా ప్రభుత్వాలు, అధికారులు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి కంటెస్టెంట్ కార్పొరేటర్ ఎల్లేష్, నరసింహ, కిరణ్, అనిల్, రాజేష్ యాదవ్, శ్యామ్ రాజ్, శివ, నిర్మల , తిమ్మక్క పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here