చందాన‌గ‌ర్ లో ఘ‌నంగా మేడే ఉత్స‌వాలు

శేరిలింగంపల్లి, మే 1 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి మండల పరిధిలో చందానగర్ సబ్‌స్టేషన్ వద్ద మేడే సంద‌ర్భంగా జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు జగదీష్, జిల్లా నాయకుడు చల్ల శోభన్, సిఐటియు శేరిలింగంపల్లి కార్యదర్శి కొంగరి కృష్ణ మాట్లాడుతూ కార్మికులకు ఎనిమిది గంటల పని విధానం రావాలని 1886లో అమెరికాలోని చికాగో నగరంలో హే మార్కెట్లో జరిగిన వీరోచిత పోరాటంలో అప్పుడు ఉన్న పెట్టుబడి సమాజంలో ఎనిమిది గంటల పని విధానం కోసం మహోత్తరమైన పోరాటం చేస్తుండగా అక్కడ ఉన్న పెట్టుబడిదారులు కార్మికులని విచక్షణారాహితంగా లాఠీచార్జి తుపాకులతో మ‌ట్టుబెట్టార‌ని అన్నారు. వారి పోరాటం ఫ‌లితంగానే నేడు కార్మికులు 8 ప‌నిగంట‌ల స‌దుపాయాన్ని పొందుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్, జిహెచ్ఎంసి వర్కర్స్ అంగన్వాడీ టీచర్లు, రమేష్ రెడ్డి, ఆంజనేయులు, క్రాంతి కిరణ్, నాగమణి, సువర్ణ లక్ష్మి పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here