శేరిలింగంపల్లి, మే 18 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని గౌతమి విద్యా క్షేత్ర విద్య పాఠశాలలో మహిళా ఆరోగ్య వికాస్ తరంగిణి వింగ్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ఆశీస్సులతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ హాజరై మాట్లాడుతూ సమాజంలో సగభాగం మహిళలకు వారి ఆరోగ్య సంరక్షణ ఎంతో ముఖ్యమని ఆయన గుర్తు చేశారు. ప్రధానంగా మహిళలు వివిధ రకాల క్యాన్సర్లు పెద్ద ఎత్తున మహిళల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తున్నాయని ఆయన అన్నారు. పేద, మధ్య తరగతి, ఉన్నత వర్గాల మహిళల సైతం వ్యాధిని గుర్తించడంలో నిర్లక్ష్యం చేయడం లేదా ఆర్థిక పరిస్థితుల వల్ల బయటికి చెప్పకపోవడంతో అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. క్యాన్సర్ వ్యాధులపై స్థానికంగా అనేక ఆరోగ్య, స్వచ్ఛంద సంస్థలు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని ఆయన అన్నారు. మహిళ తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ కుటుంబాన్ని, సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత వారిపై ఎంతైనా ఉందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి మహిళా ఆరోగ్య వికాస్ తరంగిణి వింగ్ సభ్యులు కే విమలదేవి, సుగుణ, మాధవి, ప్రవీణ, మోహిని, కృషినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాపిరెడ్డి, చంద్ర ఓబుల్ రెడ్డి, సురేష్ కుమార్ రెడ్డి, అక్కినేని అజయ్ కుమార్, వంశీ కృష్ణారెడ్డి, శివ తదితరులు పాల్గొన్నారు.