శేరిలింగంపల్లి, జూలై 2 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్లలో నల్లగండ్ల మహిళ సమైక్య అధ్యక్షురాలు వీణ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇందిరా మహిళ శక్తి కుట్టు కేంద్రంను కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, ఉప్పలపాటి శ్రీకాంత్, శేరిలింగంపల్లి యు. సి.డి ప్రాజెక్ట్ ఆఫీసర్ నాగమల్లేశ్వరితో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మొట్టమొదటి ఇందిరా మహిళా శక్తి కుట్టు కేంద్రం ను ప్రారంభించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని చాలా శుభపరిణామం అని అన్నారు. తన వంతు సహాయంగా తన సొంత ఖర్చుతో కుట్టు కేంద్రంకు ఐదు కుట్టుమిషన్లను అందచేయడం జరిగిందని అన్నారు. ప్రభుత్వం ద్వారా వచ్చిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క మహిళ కూడా అందిపుచ్చుకుని, ఆర్థికంగా బలోపేతం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, మంత్రి ప్రగఢ సత్యనారాయణ, MD ఇబ్రహిం, విష్ణువర్ధన్ రెడ్డి , సురేష్ నాయక్, ప్రభాకర్ రెడ్డి, రాజేందర్, కాజా, లక్ష్మణ్, యు సి డి సిబ్బంది, మహిళా సమైక్య సభ్యులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.