శేరిలింగంపల్లి, ఏప్రిల్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని జవహర్ నగర్ కాలనీ లో ఉన్న ఆల్ కైర్ కార్యాలయంలో జరిగిన గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో భాగంగా టైలరింగ్ , మెహింది డిజైనింగ్, కంప్యూటర్ శిక్షణ తరగతులను పూర్తి చేసుకున్న వారికి కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డితో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ పేద , మధ్యతరగతి ప్రజలకు, మహిళలకు ఆర్థిక స్వాలంబనకు ఆల్ కైర్ సంస్థ ఎనలేని కృషి చేస్తుందని అన్నారు. వారిని ప్రత్యేకంగా అభినదిస్తున్నానని, మహిళలకు టైలరింగ్ , మెహింది డిజైనింగ్, కంప్యూటర్ శిక్షణ ఇచ్చి వారికి జీవనోపాధి కల్పించడం వారు స్వశక్తితో ఎదగడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. పేద , మధ్య తరగతి మహిళల జీవితాలలో వెలుగులు నింపిన వారు అవుతారని కొనియాడారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారు ఎవరి పై ఆధారపడకుండా స్వ శక్తి తో ఎదగాలని , ఆర్థిక స్వాలంబన సాదించాలని, కృషితో జీవితంలో గొప్పగా రాణించాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రఘునాథ్ రెడ్డి, మహ్మద్ ముబషీర్ అహ్మద్, మహమ్మద్ వకిల్ అహ్మద్, మహ్మద్ బేగ్, అక్బర్ ఖాన్, యూసఫ్ పాషా, నజీర్ ఖాన్, అక్తర్ ఖాన్, జుబేర్ బేగ్, నరేందర్ బల్లా తదితరులు పాల్గొన్నారు.