శేరిలింగంపల్లి, ఏప్రిల్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ఇల్లు లేని నిరుపేదలకు డబల్ బెడ్ రూమ్ లు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు పానుగంటి పర్వతాలు అన్నారు.శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని టెలికాం నగర్, ఇజ్జత్ నగర్, ఆదిత్య నగర్ శాఖల మహాసభలను ఇజ్జత్ నగర్ లో నిర్వహించారు. ఈ మహాసభలకు పర్వతాలు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ పేదలు ఇప్పటికీ ఇల్లు లేని ప్రజలు ఎంతోమంది ఉన్నారు. మెరుగైన విద్య . వైద్యం ప్రజలకు అందక ఎంతోమంది నిరాశలో ఉన్నారని అన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు శేరిలింగంపల్లిలో అలుపెరుగని పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యుడు కే చాంద్ యాదవ్, ప్రజానాట్యమండలి జిల్లా సమితి సభ్యులు కే సుధాకర్, కె లక్ష్మమ్మ, మహిళా సమైక్య మండల కార్యదర్శి కే నరసింహారెడ్డి, బిఓసి జిల్లా కార్యదర్శి కే కాసిం, ఎస్ కొండలయ్య, జెట్టి శ్రీనివాస్, ఎం వెంకటేష్, బి నారాయణ, రఘు కృష్ణ, చంద్రమ్మ, ధర్మ తేజ, నితీష్, ఎస్ నరసమ్మ తదితరులు పాల్గొన్నారు.