శేరిలింగంపల్లిలోని 64 చెరువులను సుందర శోభిత వనాలుగా తీర్చిదిద్దుతాం: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి, మే 1 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): మియపూర్ డివిజన్ పరిధిలోని గుర్నాథమ్ చెరువు సుందరికరణలో భాగంగా Nexus select Malls కంపెనీ CSR ఫండ్స్ ద్వారా మల్లిగవాడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా చేపట్టనున్న చెరువుల పునర్జీవనంలో భాగంగా సుందరీకరణ, పునరుద్ధరణ పనులను హైడ్రా అధికారులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ప‌రిశీలించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ అరెకపూడి గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ని 64 చెరువులను అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని, చెరువుల సుందరీకరణ తో స్వచ్చమైన వర్షపు జల సిరులను ఒడిసిపడుదామని అన్నారు. ఈ కార్యక్రమంలో హైడ్రా DE నాగరాజు, DE మోహన్ , హైడ్రా టెక్నికల్ కన్సల్టెన్సీ యూనిస్, సిబ్బంది, నాయకులు మొహన్ ముదిరాజు, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, కాలనీల అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here