ప్రైవేటు ఉద్యోగ , కార్మికులకు అండగా ఉంటాం: పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 14 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీ లో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ కార్యాలయంలో తెలంగాణ ప్రైవేటు ఉద్యోగ సంఘం డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గంధం రాములుతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ డైరీని ఆవిష్క‌రించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రైవేట్ రంగంలో పని చేస్తున్న ప్రైవేటు ఉద్యోగుల, కార్మికుల సంక్షేమం కోసం గత 15 సంవత్సరాల నుంచి కృషి చేస్తున్న తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘం రాష్ట్ర కమిటీ 2025 డైరీని అవిష్కరించుకోవడం చాలా సంతోషంగా ఉంది అని తెలియచేసారు. ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ప్రైవేటు ఉద్యోగులు, ప్రైవేటు టీచర్లు, ఐటి లో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని, మీకు ఏ చిన్న సమస్య ఎదురైన తప్పకుండా పరిష్కరిస్తామని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు గంధం రాములు , సంఘం ఐటి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కట్ట రవికుమార్ గుప్తా, మీడియా విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర యాకయ్య , ప్రైవేట్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పి వై రమేష్, మున్సిపల్ కార్మికుల విభాగం అధ్యక్షుడు గ్యార శ్రీనివాస్ , మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు శ్రావణి రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు పుష్ప మన్యం, నాయకులు సంజీవరెడ్డి, నాయినేని చంద్రకాంతరావు ,అంబాల మహేష్ కుమార్ గౌడ్, విటల్ ముదిరాజ్ , లింగయ్య, రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్ ముదిరాజ్ , ఆనందరావు ,అంజలి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here