శేరిలింగంపల్లి, ఏప్రిల్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): బిఆర్ఎస్ పార్టీ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా ఈ నెల 27న వరంగల్ లో నిర్వహించనున్న బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు ప్రతి ఒక్కరు హాజరై విజయవంతం చేయాలని శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా కోరారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ ఖాజాగుడాలో గోడకు వాల్ పోస్టర్ అంటిస్తూ కార్యకర్తలందరు సభను విజయవంతం చేయాలని అన్నారు. అలాగే బిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి పనుల గురించి ప్రజలను చైతన్య పరచాలని పిలుపునిచ్చారు.