న్యూ‌కాలనీలోని సమస్యలను పరిష్కరిస్తాం – మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ కాలనీలో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. డివిజన్ పరిధిలోని న్యూ కాలనీలో పర్యటించారు. వర్షాకాలంలో డ్రైనేజీ మురుగు నీరు రోడ్లపై నిలవకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాలనీలో రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ సహకారంతో డివిజన్ పరిధిలో మంజూరైన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఈ స్రవంతి, ఏఈ శివప్రసాద్, వాటర్ వర్క్స్ మేనేజర్ సాయిచరిత, ఎస్ ఆర్ పి కనకరాజు, వర్క్ ఇన్ స్పెక్టర్లు జగదీష్, నవీన్, రఘు, లింగయ్య, సాయి యాదవ్, తిమ్మరాజు, శంకర్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

న్యూ కాలనీలో సమస్యలు తెలుసుకుంటున్న మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here