శేరిలింగంపల్లి, జనవరి 29 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని యూత్ కాలనీ లో గల పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై కార్పొరేటర్లు పూజిత గౌడ్, జగదీశ్వర్ గౌడ్, GHMC ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి కాలనీలో PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా యూత్ నగర్ కాలనీ వాసులు మాట్లాడుతూ కాలనీలో సీసీ రోడ్లు వేయాలని, డ్రైనేజి వ్యవస్థను, మంచి నీటి వ్యవస్థ ను మెరుగుపరచాలని కోరారు.
ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ యూత్ కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు కాలనీలో పాదయాత్ర చేయడం జరిగిందని అన్నారు. యూత్ కాలనీ లో నెలకొన్న అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్ల సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని తెలిపారు. త్వరలోనే సీసీ రోడ్డు ఏర్పాటు చేస్తామని, కాలనీలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించామని, అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్లను అతి త్వరలో చేపట్టి ప్రజలకు అందుబాటులో కి తీసుకువస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో GHMC ఇంజనీరింగ్ విభాగం అధికారులు DE శ్రీదేవి , AE ప్రతాప్, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.