శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 11 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని మంజీర పైప్ లైన్ రోడ్డు, హఫీజ్పేట్ ఫ్లై ఓవర్ నుండి HMWS, SB రిజర్వాయర్ వరకు, జనప్రియ నగర్ కాలనీలలో రూ. 9 కోట్ల 67 లక్షల 50 వేలతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు, బీటీ రోడ్ల నిర్మాణం పనులకు , ఓపెన్ జిమ్ నిర్మాణ పనులకు కార్పొరేటర్లు పూజిత, జగదీశ్వర్ గౌడ్ లతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, శేరిలింగంపల్లి నియోజకవర్గం, కాలనీల అభివృద్దే ధ్యేయంగా ప్రజల సౌకర్యార్థం సీసీ రోడ్ల నిర్మాణం పనులకు, బీటీ రోడ్ల నిర్మాణం పనులకు , ఓపెన్ జిమ్ నిర్మాణము పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందని, సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని, కాలనీ వాసులకు ఉపశమనం లభించింది అని, మౌళిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తానని అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన , అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, కాలనీల అసోసియేషన్ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.






