క్రీడాకారుల‌ను ఎల్ల‌ప్పుడూ ప్రోత్స‌హిస్తాం: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, మే 4 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని PJR స్టేడియంలో అథ్లెటిక్స్ NIS ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ MV ప్రసాద్ ఆధ్వర్యంలో Muddanas తెలంగాణ ఓపెన్ ప్రైజ్ మనీ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ముగింపు వేడుకలలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ , చందానగర్ డివిజన్ సీనియర్ నాయకుడు ర‌ఘునాథ్ రెడ్డితో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత‌ ఇస్తుందని, క్రీడాకారులకు తగిన సదుపాయాలు ఉన్నాయని అన్నారు. అన్ని క్రీడలను, క్రీడాకారులను ప్రభుత్వం ఎప్పుడూ ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీకాంత్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, నరేందర్ బల్లా, క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here