ప్ర‌జ‌ల‌కు ఎల్ల‌ప్పుడూ అందుబాటులో ఉంటాం: జగదీశ్వర్ గౌడ్

శేరిలింగంప‌ల్లి, జూన్ 18 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని శారద నగర్ కాలనీ(గెజిటెడ్ ఆఫీసర్స్ కాలనీ) లో హఫీజ్ పేట్ డివిజన్ కార్పొరేటర్ పూజిత గౌడ్ తో కలిసి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, గ్రేటర్ హైదరాబాద్ స్టాండింగ్ కమిటీ సభ్యుడు వి జగదీశ్వర్ గౌడ్ ప‌ర్య‌టించారు. ఈ సందర్భంగా కాలనీ అభివృద్ధికి ఎంతగానో సహకరించిన స్థానిక కార్పొరేటర్లను నూతన కార్యవర్గం సభ్యులు సన్మానించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కాలనీ అసోసియేషన్ సభ్యుల‌ను కార్పొరేటర్, నియోజకవర్గ ఇంచార్జ్ వి పూజిత జగదీశ్వర్ గౌడ్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు కాలనీలో చేపటాల్సిన అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. కాలనీ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ముందుకు సాగుతోందని, తమ‌ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాలింగ్ యాదగిరి గౌడ్, కనకమామిడి నరేంద్ర గౌడ్, కాలనీ అధ్యక్షుడు త్రినాథ్, కాలనీ సభ్యులు రవి కిరణ్, శ్రీనివాస్, రంగారావు, వినయ్, శ్రీదేవి, శారద తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here