వాటర్ హెడ్ ఇండియా సంస్థ సేవలు అమోఘం: కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

శేరిలింగంపల్లి, అక్టోబర్ 18 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని కృషి నగర్ కాలనీలో లోటస్ లేక్ వ్యూ అపార్ట్మెంట్స్, వివేకానంద అపార్ట్మెంట్స్ లలో వాటర్ హెడ్ ఇండియా సంస్థ సౌజన్యంతో రూ.3 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన బోర్ పునరుద్ధరణ పనులు పూర్తయిన సందర్భంగా వాటర్ హెడ్ ఇండియా సంస్థ సభ్యులు, అపార్ట్మెంట్స్ అసోసియేషన్ సభ్యులతో కలసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ కృషి నగర్ కాలనీలోని లోటస్ లేక్ వ్యూ అపార్ట్మెంట్స్, వివేకానంద అపార్ట్మెంట్స్ లలో వాటర్ హెడ్ ఇండియా సంస్థ సౌజన్యంతో రూ. 3 లక్షలతో చేపట్టిన బోర్ పునరుద్ధరణ పనులు, ఇంకుడు గుంతల పనులు పూర్తయిన సందర్భంగా వాటర్ హెడ్ ఇండియా సంస్థ సభ్యులు, అపార్ట్మెంట్స్ అసోసియేషన్ సభ్యులతో కలసి ప్రారంభించడం జరిగింద‌ని, అపార్ట్మెంట్స్ లో బోరు పునరుద్ధరణ పనులు ఇంకుడు గుంతలను నిర్మించడం చాలా అభినందించదగ్గ విషయం అని అన్నారు. వాటర్ హెడ్ ఇండియా సంస్థ సేవలు అమోఘం అని, కాలనీలలో సామాజిక దృక్పథంతో సమాజ సేవకు వారు చేస్తున్న సేవలు చాలా గొప్పవి అని అన్నారు. ఈ కార్యక్రమంలో కృషి నగర్ కాలనీ వాసులు జనరల్ సెక్రెటరీ వంశీ కృష్ణారెడ్డి, జానకి రామ్, శ్రీకాంత్ రెడ్డి, మహేందర్, కమలాకర్ రెడ్డి, రాంభూపాల్ రెడ్డి, శ్రీనివాస్, సురేష్ రెడ్డి, చంద్ర ఓబుల్ రెడ్డి, సురేష్, శ్రీనివాస్, రాధిక, లక్ష్మీ, విజయ్ కుమార్, వాటర్ హెడ్ ఇండియా సంస్థ సభ్యులు కృష్ణ , విజయరేఖ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here