పండగ రోజునా ప్రజలకు ఇబ్బందులేనా..? – చందానగర్ మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: పండగ రోజు సైతం ముస్లిం సోదరులు డ్రైనేజీ సమస్యతో ఇబ్బందులు పడుతూ ప్రార్థనలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చందానగర్ మాజీ కార్పొరేటర్, బిజెపి నాయకురాలు బొబ్బ నవత రెడ్డి వాపోయారు. చందానగర్ డివిజన్ పరిధిలోని వేముకుంట బస్తీలో నెలకొన్న డ్రైనేజీ సమస్యను స్థానికులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా బొబ్బ నవత రెడ్డి మాట్లాడుతూ ముస్లింల పవిత్రమైన బక్రీద్ పండగ రోజు మజీద్ ముందే మురుగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం‌ సిగ్గుచేటన్నారు. మజీద్ గేట్ ముందే డ్రైనేజీ పైప్ లైన్ నిండి మొత్తం రోడ్లపై మురుగునీరు ప్రవహిస్తుందని అన్నారు. వెంటనే సంబంధిత అధికారులకు నవత రెడ్డి ఫోన్ చేసి పండగ రోజు బస్తీ వాసులు ఇబ్బంది పడుతున్నారని, వెంటనే సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులను కోరారు.

వేముకుంట లో నెలకొన్న డ్రైనేజీ సమస్యను పరిశీలిస్తున్న మాజీ కార్పొరేటర్ బొబ్న నవత రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here