వేముకుంటలో డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తాం – ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు తక్షణ చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని వేముకుంట కాలనీ లో తలెత్తిన డ్రైనేజీ సమస్య పరిష్కారానికై స్థానిక కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డితో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు.

వేముకుంటలో డ్రైనేజీ మ్యాన్ హోల్స్ ను శుభ్రం చేయిస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వేముకుంట కాలనీలో నెలకొన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తామన్నారు. మ్యాన్ హోల్ నుండి ప్రతి మ్యాన్ హోల్ వరకు ఎయిర్ టెక్ మిషన్ ద్వారా పూడికను తొలగించడం జరిగిందన్నారు. డ్రైనేజీ నీటి ప్రవాహం సాఫీగా సాగేలా చూడాలని అధికారులకు సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, హఫీజ్ పేట్ డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, నాయకులు అక్బర్ ఖాన్, నరేంద్ర బల్లా, రాజు, యూసఫ్, దాస్ , శ్రీనివాస్, ఖాదర్, అల్తాఫ్, రవి, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

వేముకుంటలో సమస్యలు తెలుసుకుంటున్న ప్రభుత్వ విప్ గాంధీ

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here