మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): ప్రమాదంలో కాలును కోల్పోయిన ఓ బాధితుడికి తెరాస నాయకుడు వాసిలి చంద్రశేఖర్ సహాయం అందించారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎంఏ నగర్ కాలనీకి చెందిన వెంకటయ్య రెండు సంవత్సరాల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదం లో ప్రమాదవశాత్తూ కాలును కోల్పోయాడు. ఈ క్రమంలో సమాచారం తెలుసుకున్న తెరాస సీనియర్ నాయకుడు వాసిలి చంద్రశేఖర్ బాధితుడికి గురువారం ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ల చేతుల మీదుగా రూ.1.40 లక్షల మొత్తంతో రూపొందించిన కృత్రిమ కాలును అందజేశారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ చేసిన సేవ అభినందనీయం అని అన్నారు. సమాజంలో ఇలాంటి బాధితులను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలన్నారు. బాధితుడికి తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ తెరాస అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, తెరాస నాయకులు వాల హరీష్, మోహన్ ముదిరాజ్, గంగాధర్, బీఎస్ఎన్ కిరణ్ యాదవ్, మాధవరం గోపాల్, గోపరాజు శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, చంద్రిక ప్రసాద్, రోజా, సుప్రజ పాల్గొన్నారు.
