శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ సబ్స్టేషన్ పరిధిలో శుక్రవారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు తారానగర్ ఏఈ రవిచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ నిర్వహణ మరమ్మత్తుల నిమిత్తం మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంజినీర్స్ ఎన్క్లేవ్, హుడా కాలనీ, శాంతినగర్, ఇందిరానగర్, చందానగర్, లింగంపల్లి, మార్కెట్, తారానగర్, ఎస్ఎం లే అవుట్, ఓల్డ్ లింగంపల్లి, రైతు బజార్, లింగంపల్లి పోలీస్ స్టేషన్, హుడా ట్రేడ్ సెంటర్, రైల్ విహార్, శివాజీనగర్, కానుకుంట, రామయ్య కాలనీ, వెంకట్ రెడ్డి కాలనీలలో కరెంటు ఉండదన్నారు.