వాజ్ పేయి అడుగుజాడల్లో పయనించాలి – గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధి గౌలిదొడ్డిలోని కార్పొరేటర్ కార్యాలయంలో భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి 97 వ జయంతి వేడుకలను కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వాజ్ పేయి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి‌ అర్పించారు. కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ దేశ అత్యున్నత వైభవం కోసం అటల్ బిహార్ వాజ్ పేయి కృషి మరవలేనిదని అన్నారు. ప్రధానమంత్రిగా అటల్జీ దూరదృష్టితో కూడిన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా బలమైన భారతదేశానికి పునాది వేశారని అన్నారు. వాజ్ పేయి సేవలను స్మరించుకుంటూ మోదీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం సుపరిపాలన దినోత్సవంను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు వసంత్ కుమార్ యాదవ్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి, సీనియర్ నాయకులు, విట్టల్, శ్రీ రాములు, నర్సింగ్ నాయక్,‌ హరీష్, శంకర్ యాదవ్, కిషన్ గౌలి, ప్రకాష్, అనిల్, ప్రసాద్, శేఖర్, ప్రభాకర్, మన్నే రమేష్, కృష్ణ, గంగాధర్, విష్ణు, శివ, నరేందర్, రాజు, శ్రీను, గోరఖ్, అంబాజీ, అరుణ్, సాయిరాం, సాయినాథ్, లింబాజి, ‌రామ్, సాయి, తుకారాం, సురేష్, శివ కుమార్, రాకేష్, చిన్న, మౌసీన్, బంటీ, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here