శేరిలింగంపల్లి, మార్చి 29 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ లోని కానరి ద స్కూల్ లో ఉగాది, రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్ధులు గీతాలాపన, పంచాంగ శ్రవణం వంటి సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయిని లిడియా క్రిస్టినా విద్యార్థులకు ఉగాది పండుగ ప్రాముఖ్యత గురించి, తెలుగు సంవత్సరం,తెలుగు నెలల గురించి, తిధి, వార, నక్షత్రాల గురించి విపులంగా అవగాహన కల్పించారు.ఉగాది అంటే షడ్రుచుల సమ్మేళనమని, కష్ట సుఖాలను సమాన రీతిలో చూడాలని, కష్టం వచ్చినప్పుడు కుంగిపోవద్దని, సుఖం వచ్చినప్పుడు పొంగిపోవద్దని, జీవితం అంటే తీపి చేదుల కలయిక అనీ, అన్నింటిని తట్టుకొని జీవిత లక్ష్యాలను సాధించాలని ఆమె సూచించారు. ఉగాది పచ్చడిని తయారు చేసి సేవించారు.
అనంతరం రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్ధులు రంజాన్ పండుగ ప్రాశస్త్యాన్ని ఒక నాటిక ద్వారా వివరించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించడం ద్వారా దానంచేయడంలో ఉన్నసంతృప్తిని విద్యార్ధులు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ లిడియీ క్రిస్టినా మాట్లాడుతూ పవిత్ర గ్రంధం ఖురాను అవతరించినది ఈ పవిత్ర రమ్దాన్ మాసం లోనే కాబట్టి, ముస్లింలు భక్తిశ్రద్దలతో ఉపవాసాలు ఫిత్రా జకాత్ దానధర్మాలు చేస్తుంటారన్నారు. పండుగలు మన జీవన స్రవంతిలో భాగమై మన జాతీయతకు సంస్కృతీ వికాసానికి దోహదం చేస్తాయన్నారు.ఈ విధంగా అన్ని పండుగలను పాఠశాలలో జరపడం అన్నది విద్యార్ధులలో మనమంతా వసుధైవకుటుంబకమ్ అన్న భావన కలుగ జేయడానికేనని తెలిపారు.పాఠశాల చిన్నారులు సాంప్రదాయ వస్త్రధారణలలో వచ్చి అందరినీ అబ్బురపరిచారు. ఈ కార్యక్రమంలో హెడ్ సీనియర్ స్కూల్ డాక్టర్ నవీన్ కుమార్ ఇమ్మడి, కోఆర్డినేటర్లు అపర్ణ, ముక్తా, అడ్మిన్ మేనేజర్ మహేష్ అక్కం, ఇతర ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.