శేరిలింగంపల్లి, మార్చి 29 (నమస్తే శేరిలింగంపల్లి): రంజాన్ పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ముస్లింల కుటుంబాలకు బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు Dr రవిందర్ యాదవ్ చందానగర్ లోని తన కార్యాలయంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముస్లింలకు ఆయన రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.