నమస్తే శేరిలింగంపల్లి: ఉద్యమకారులను ఏకం చేసే దశలో భాగంగా హఫీజ్ పేట్ డివిజన్ పరిధి సప్తగిరి కాలనీ లో నివాసం ఉండే ఉద్యమకారుడు కిషోర్ ను తోటి ఉద్యమకారులు కలిశారు. ఉద్యమంలో కిషోర్ పెద్ద ఎత్తున ఉద్యమానికి సహకరించాడని, ఉద్యమంలో చేసిన సంఘటనలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఉద్యమకాలం నాటి జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. ఉద్యమకారులకు నేడు తగిన ప్రాధాన్యత కరువవడం, గుర్తింపు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. ఉద్యమకారులను ఏకం చేసే బాధ్యతను తీసుకోవడం చాలా సంతోషకరమని, చాలా కాలం తర్వాత ఇలా కలవడం పట్ల కిషోర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మిద్దెల మల్లారెడ్డి, సంగారెడ్డి, శేఖర్, జమీర్ తదితరులు ఉన్నారు.